ఏపీలో కరోనా కేసులు గణనీయంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 840 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 37,849 శాంపిల్స్ పరీక్షించగా 840 మందికి కోవిడ్ పాజిటివ్గా తేలింది.రాష్ట్రంలో అత్యధికంగా విశాఖలో 183 కేసులు నమోదు కాగా.. చిత్తూరులో 150, కృష్ణలో 88 , ఈస్ట్ గోదావరిలో 70, నెల్లూరులో 69 కరోనా కేసులు నమోదయ్యాయి. విశాఖలో కొవిడ్ కారణంగా ఒకరు మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 2972 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 133 మంది కరోనా నుంచి కోలుకున్నారు.