గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 17,940 శాంపిల్స్ పరీక్షించగా, 54 మందికి కరోనా సోకినట్లు వైద్యశాఖ అధికారులు వెల్లడిరచారు. కొత్తగా ఎటువంటి మరణం సంభవించలేదని తెలిపారు. గడిచిన 24 గంటల్లో 121 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1099 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన 54 కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 19, విశాఖలో 13 కేసులు వచ్చాయని పేర్కొన్నారు. కాగా కోవిడ్ నివారణ, వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటి సీఎం ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్ ఫోర్స్ అధికారులు, వైద్యారోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.