కొత్తగా 1,501 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,501 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. తాజా కేసులతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడినవారి సంఖ్య 19,98,603కు చేరింది. నిన్న ఒక్కరోజే మహమ్మారిబారినపడి మరో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మరణించిన వారి సంఖ్య 13,696కు చేరింది. గడిచిన 24 గంటల్లో 1,697 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 19 లక్షల 69 వేల 169 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15,738 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 2,59,03,366 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.