ఆంధ్రప్రదేశ్లో మిగిలిన కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 15న జరిగే ఎన్నికలకు బుధవారం (3వతేదీ) నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 17న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఏపీలో మిగిలిపోయిన పంచాయతీలు, పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వార్డు మెంబర్ల స్థానాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.