ఏపీలో 15 నుంచి 18 ఏళ్ళ వయసు ఉన్న పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో టీకా పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. తొలి డోసు తీసుకున్న టీనేజర్లకు నాలుగు వారాల తర్వాత రెండో డోస్ వేయనున్నారు. మరో వైపు 60 ఏళ్ల వయసు పైబడి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి మూడో డోసు ఇచ్చేందుకూ ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 10 నుంచి ఆ వయసు వారికి బూస్టర్ డోసు వేయనున్నట్లు అధికారులు తెలిపారు.