Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఏపీలో 1,628 కరోనా కేసులు


ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి కొనాసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 71,152 నమూనాలు పరీక్షించగా, 1,628 మందికి కరోనా నిర్థారణ అయ్యింది. కొవిడ్‌ బారినపడి 22 మంది మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కృష్ణాలో నలుగురు, గుంటూరులో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, తూర్పు గోదావరి, కర్నూల్‌, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. యాక్టివ్‌ కేసులు 23,570 ఉండగా, మొత్తం 19,05,000 మంది రికవరీ అయ్యారు. కొత్తగా 24 గంటల వ్యవధిలో 2,744 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img