Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఏపీ అసెంబ్లీలోకి సెల్‌ ఫోన్లు నిషేధం

ఏపీ శాసనసభలోకి సభ్యులెవరూ సెల్‌ ఫోన్లను తీసుకురావొద్దని స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కీలక ప్రకటన చేశారు. ఈ నెల 19న అసెంబ్లీలో జరిగిన చంద్రబాబు ఉద్వేగంగా మాట్లాడుతున్నప్పుడు స్పీకర్‌ మైక్‌ కట్‌ చేసినా టీడీపీ సభ్యులు సెల్‌ఫోన్‌లో రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. వీటిపై వివాదం కూడాచెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పీకర్‌ తమ్మినేని ముఖ్యమైన ప్రకటన అంటూ సభలో సెల్‌ ఫోన్లు తీసుకురావడంపై నిషేధం విధించారు.కాగా ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు నేటి(శుక్రవారం)తో ముగియనున్నాయి. అంటే వచ్చే బడ్జెట్‌ సమావేశాల నుంచి ఈ నిర్ణయం అమలవుతుందన్నమాట.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img