Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ఏపీ అస్తవ్యస్త విభజనకు బీజేపీనే కారణం : రామకృష్ణ

ఏపీ అస్తవ్యస్త విభజనకు కారణం బీజేపీయేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో ఆర్థిక ఇబ్బందులకు కాంగ్రెస్‌, బీజేపీనే కారణమన్నారు.ఉద్యోగ, ఉపాధ్యాయుల ఉద్యమాలను ముందుండి నడిపిస్తామన్నారు. ఉద్యోగులను సీఎం జగన్‌ మోసం చేశారని రామకృష్ణ అన్నారు. పీఆర్సీ కమిటీ నివేదికను ఇవ్వడానికి ముఖ్యమంత్రికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ప్రశ్నించే వారిపై జగన్‌ ప్రభుత్వం బెదిరింపులకు దిగుతోందని మండిపడ్డారు. గురువారం వామపక్ష పార్టీలతో సమావేశం అయ్యాక… ఉద్యోగ ఉపాధ్యాయుల ఉద్యమాలకు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img