రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్ర ప్రభుత్వ పింఛన్దారులకు 3.144 శాతం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఆదేశాలను శనివారం ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. జూలై జీతంతో కలిపి డీఏని ఇస్తామని అధికారులు తెలిపారు.