Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి వర్ల రామయ్య లేఖ

టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రాణాలకు ముప్పు ఉందని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. ఈ మేరకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి సాయుధ బలగాలతో భద్రత కల్పించాలంటూ ఆయన లేఖలో కోరారు. ఏపీతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి టీడీపీ కార్యాలయాన్ని సందర్శించే నాయకులకు సైతం తీవ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తుల నుంచి తీవ్రమైన ముప్పు ఉందని చెప్పారు. ఇప్పటికే కొందరు దుండగులు పార్టీ కార్యాలయంపై దాడి చేసిన సంగతిని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించి పార్టీ కార్యాలయానికి నిత్యం సాయుధ బలగాలతో రక్షణ కల్పించాలని లేఖలో డిమాండు చేశారు. ముఖ్యంగా వైసీపీ నేతల నుంచి తమకు ప్రమాదం ఉందని లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img