Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఏపీ నుంచి వెళ్లిపోతున్నామని అమరరాజా ప్రతినిధులు ఎక్కడైనా చెప్పారా?: మంత్రి అమర్నాథ్‌

అమరరాజా గ్రూప్‌ తెలంగాణలో ఈవీ బ్యాటరీల పరిశ్రమ నెలకొల్పేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఏపీ నుంచి పరిశ్రమలు తరలివెళ్లిపోతున్నాయని, అమరరాజాను ఏపీ ప్రభుత్వం వేధించిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. అటు, ప్రధాన పత్రికల్లోనూ ఇదే అంశం మీద వైసీపీ ప్రభుత్వంపై కథనాలు వచ్చాయి. దీనిపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ స్పందించారు. ఏపీ నుంచి పెట్టుబడులు తరలివెళుతున్నాయంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌ వ్యాపారం ఏపీలోనే ఉందని, ఆయనను ఏమైనా ఏపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిందా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఈ రాష్ట్రంపై ప్రేమ లేకపోవచ్చు… వారి కంపెనీ కార్పొరేట్‌ ఆఫీసు హైదరాబాదులో ఉండొచ్చు… కానీ హెరిటేజ్‌ వ్యాపార సామ్రాజ్యం అంతా ఏపీలోనే ఉంది కదా అని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు మద్దతుగా ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. ఈనాడు, ప్రియ, ఆంధ్రజ్యోతి వంటి సంస్థలు సజావుగానే నడుస్తున్నాయని, ఒకవేళ ప్రభుత్వం ఇబ్బందిపెడితే ఈ సంస్థలు ఎలా నడుస్తున్నాయని అన్నారు. అమరరాజా గ్రూప్‌ ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెడితే ఏపీ నుంచి వెళ్లిపోయినట్టా? అని మంత్రి ప్రశ్నించారు. అమరరాజా గ్రూప్‌ కు చెందిన పరిశ్రమలు ఇప్పటికీ ఏపీలో నడుస్తున్నాయని, వాటికి సంబంధించిన కార్యకలాపాలు జరుగుతున్నాయని వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img