Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఏపీ ఫైబర్‌నెట్‌ కేసులో సాంబశివరావు అరెస్ట్‌

గత ప్రభుత్వంలో ఫైబర్‌ నెట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఎండీగా పనిచేసిన సాంబశివరావును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఫైబర్‌నెట్‌ కేసులో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు అనంతరం సాంబశివరావును సీఐడీ అధికారులు కోర్టులో హాజరుపర్చనున్నారు. టెర్రా సాఫ్ట్‌ కంపెనీకి సాంబశివరావు నిబంధనలకి విరుద్దంగా టెండర్లు కట్టబెట్టినట్లు సీఐడీ గుర్తించింది. ఫైబర్‌ నెట్‌లోని తొలి ఫేజులో రూ. 320 కోట్ల టెండర్లలో రూ. 121 కోట్ల అవినీతిని సీఐడీ గుర్తించింది. ఇప్పటికే ఈ అక్రమాలపై 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఏ-1గా వేమూరి హరిప్రసాద్‌, ఏ-2గా సాంబశివరావులపై కేసు నమోదైంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img