Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ఏపీ రాజకీయాల్లో ఎందుకు జోక్యం : సజ్జల

ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాలపై తెలంగాణ ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాల) సజ్జల రామకృష్ణా రెడ్డి తప్పుబట్టారు. ‘‘హరీశ్‌రావు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిస్థితులను విమర్శించే బదులు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుతో ఉన్న విభేదాలను సరిదిద్దుకోవాలి’’ అని శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య సత్సంబంధాలు నెలకొనాలని, అన్ని సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని రామకృష్ణారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యల వల్ల తలెత్తే వివాదంలోకి తమను లాగకూడదని ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే.. నలుగురి ముఠా ముఖ్యమంత్రి జగన్‌ని టార్గెట్‌ చేస్తోందన్నారు సజ్జల. ఈ నలుగురి ముఠాలో టీడీపీ, జనసేన పార్టీ, వారి స్నేహపూర్వక మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఉన్నాయని రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. ఎవరేం మాట్లాడినా, ఎన్ని విమర్శలు, ఆరోపణలు చేసినా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానమన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img