ఏపీ రాజధాని అమరావతేనని, కేంద్ర ప్రభుత్వం ఆ విషయాన్ని ఒప్పుకుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం జగన్ పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకుపోయారని అన్నారు. రెండు దశాబ్దాలుగా చేసిన అప్పులకంటే వైసీపీ రెండున్నరేళ్ల పాలనలోనే రెట్టింపు అప్పులు చేశారన్నారు.. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూ. 25800 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ు. ఉపాధిహామీ పథకానికి దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులను ఏపీకి కేంద్రం ఇచ్చిందని తెలిపారు. కృష్ణా, గోదావరి బోర్డుల ఏర్పాటుకు డీపీఆర్లు ఇవ్వాలని కోరినా… ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తున్నా… జగన్ అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని దివాలా స్థాయికి తీసుకెళ్లారని అన్నారు.