:ఏపీ విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం ప్రత్యేక పీఆర్సీని ఏర్పాటు చేసింది. ఏపీ జెన్ కో, ట్రాన్స్ కో, డిస్కం ఉద్యోగులకు ప్రత్యేక వేతన సవరణ కమిషన్ను నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ ను చైర్మన్ గా నియమించింది. ఉద్యోగుల వేతనాలు, అలవెన్సుల సవరణపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.