ఏపీ శాసనమండలి నుంచి 8 మంది టీడీపీ ఎమ్మెల్సీలను సస్పెండ్ చేశారు. జగన్ సర్కారుకు వ్యతిరేకంగా టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. జంగారెడ్డిగూడెంలో 42 మంది మరణాలపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్సీలు మండలి వరకు ర్యాలీ చేశారు. మృతుల ఫొటోలకు నివాళులు అర్పిస్తూ నల్ల కండువాలతో నిరసన చేపట్టారు. కల్తీ సారా మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మండలిలో డిమాండ్ చేశారు.