Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఏపీ శాసనసభ నుంచి టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష టీడీపీ సభ్యుల ఆందోళనతో స్పీకర్‌ తమ్మినేని టీడీపీ ఎమ్మెల్యేలను ఒక్క రోజు సస్పెన్షన్‌ చేశారు. ఉదయం సభ ప్రారంభం అయినప్పటినుంచే టీడీపీ సభ్యులు ఆందోళన మొదలు పెట్టారు. నాటుసారా, కల్తీ మద్యం నిషేధించాలంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. ప్లకార్డులతో నిసనత తెలుపుతూ స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టారు. జంగారెడ్డిగూడెం మరణాలపై జ్యుడీషియల్‌ విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ సభ్యులు నివాదాలు చేయడంపై స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img