నోటిఫికేషన్ను కొట్టేసిన హైకోర్టు
ఇంటర్మీడియెట్లో ఆన్లైన్ అడ్మిషన్లకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 13 నుంచి 23 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్ల నోటిఫికేషన్ను హైకోర్టు కొట్టేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి యథావిధిగా అడ్మిషన్లు కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లను అందరి అభిప్రాయాలు తీసుకొని, ఆన్లైన్లో నిర్వహించవచ్చని సూచించింది.