ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలని వైసీపీ ఎంపీ రఘరామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జగన్పై 11 చార్జ్షీట్లు ఉన్నాయని రఘురామ తరఫున న్యాయవాది కోర్టుకి తెలిపారు. బెయిల్ రద్దు చేసి 11 చార్జ్షీట్లను విచారించాలని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కాగా బెయిల్ రద్దుకు సీబీఐ కోర్టు నిరాకరించడంతో రఘురామ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు బెయిల్ రద్దు పిటిషన్పై ఏపీ సీఎం జగన్కు నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.