Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఏపీ సీఐడీ విచారణలో మార్గదర్శి ఎండీ..

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ ఎండీ చెరుకూరి శైలజా కిరణ్ ను ఏపీ సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. హైదరాబాద్ లోని శైలజాకిరణ్‌ నివాసంలో ఈరోజు ఆమెను సీఐడీ విచారిస్తోంది. చిట్‌ఫండ్‌ చట్టం నిబంధనలను ఉల్లంఘించి నిధులు మళ్లించడంపై ఏ-1గా రామోజీరావు, ఏ-2గా శైలజతోపాటు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ మేనేజర్లపై సీఐడీ అధికారులు ఇప్పటికే కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా, దర్యాప్తులో భాగంగా శైలజను విచారించాల్సిన అవసరం ఉందని సీఐడీ నిర్ధారించింది. చెరుకూరి శైలజను విచారించేందుకు భారీ సంఖ్యలో ఏపీ సిఐడి అధికారులు జూబ్లీహిల్స్ లోని శైలజ కిరణ్ ఇంటికి చేరుకున్నారు. భారీ బందోబస్తు మధ్య ఏపీ సిఐడి పోలీసులు ఆమెను విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img