ఏపీ హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రాకు అనంతపురం జిల్లాకు చెందిన స్కూల్ విద్యార్థులు లేఖ రాశారు. తమ స్కూల్ను మరో ప్రాంతానికి తరలించడంపై ఫిర్యాదు చేశారు. తమకు చదువును దూరం చెయ్యొద్దని కోరారు. తాము స్కూల్కు వెళ్లాలంటే సరైన బస్సు సౌకర్యం కూడా లేదని.. తమ సమస్యపై స్పందించి న్యాయం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి , ప్రధాన న్యాయస్థానం అడ్రస్కు లేఖ పంపించారు.