Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఏలూరు మేయర్‌గా షేక్‌ నూర్జహాన్‌ ప్రమాణం

ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా నూర్జహాన్‌ పదవీ బాధ్యతలు చేపట్టారు. నగర మేయర్‌గా నూర్జహాన్‌, డిప్యూటీ మేయర్లుగా జి.శ్రీనివాసరావు, ఎన్‌.సుధీర్‌బాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఏలూరు కార్పొరేషన్‌ ఆవిర్భవించిన తర్వాత మూడోసారి జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ విజయభేరి మోగించింది. శు కార్పొరేషన్‌ ఎన్నికల్లో 50 డివిజన్లకు 47 మంది వైసీపీకి చెందిన వారు ముగ్గురు టీడీపీకి చెందిన వారు కార్పొరేటర్లుగా గెలుపొందారు. వీరిలో వైసీపీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్‌ అభ్యర్థులు కరోనా కారణంగా మరణించారు. మిగిలిన 48 మంది అభ్యర్థులతో కౌన్సిల్‌ శుక్రవారం కొలువుదీరింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img