Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఐదేళ్ల పాలన కాలంలో చంద్రబాబు.. ఒక్క ప్రాజెక్ట్‌ అయినా.. కట్టారా?

: మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌
రాష్ట్రంలో రూ.50 వేల కోట్లు ఖర్చు పెట్టమంటున్న టీడీపీ ఏ ప్రాజెక్ట్‌ పూర్తి చేసిందో చెప్పాలని ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ డిమాండ్‌ చేసారు. నీరు చెట్టు పేరుతో వేలకోట్లు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీ హయాంలో కమీషన్లకు కక్కుర్తి పడటం వల్లే ప్రాజెక్టులకు గ్రహణం పట్టిందన్నారు. మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ..రాయలసీమకు చంద్రబాబు చేసిందేమిటని ప్రశ్నించారు. ఐదేళ్ల పాలన కాలంలో బాబు.. ఒక్క ప్రాజెక్ట్‌ అయినా.. కట్టారా? అని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఐదేళ్లు నిద్రపోయిందన్నారు.తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి రామోజీకి కనిపించడంలేదా అని ఎద్దేవా చేశారు. కులాలు, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి బాబు దిగజారిన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు తెలంగాణలో ఉన్నాయా? అని మంత్రి అనిల్‌ ప్రశ్నించారు. ఏపీలో ప్రతి పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని అన్నారు.జగన్‌ సీఎం అయిన తర్వాత ప్రాజెక్టుల పనులు శరవేగంగా సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. సమగ్ర ప్రణాళికతో తమ ప్రభుత్వం ముందుకెళుతోందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img