Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఒంటరిగానే పోటీ : సజ్జల

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ప్రస్తుతం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి సేవలు అందించడం లేదని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.ప్రశాంత్‌ కిశోర్‌తో సీఎం వైఎస్‌ జగన్‌కి వ్యక్తిగత సాన్నిహిత్యం ఉందని, 2019 ఎన్నికల్లో ఆయన తమతో కలిసి పనిచేశారని, తరువాత ప్రశాంత్‌ కిశోర్‌ మాతో పనిచేయడం లేదు. భవిష్యత్‌లో పనిచేసే అవకాశాలు ఉండకపోవచ్చని అన్నారు. ‘మాకు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది. రాష్ట్రంలో ఏ పార్టీతోనూ మాకు పొత్తు ఉండదు. ఒంటరిగానే పోటీచేయాలన్నది సీఎం వైఎస్‌ జగన్‌ సిద్ధాంతం. మాతో పొత్తు పెట్టుకోవాలని చాలా పార్టీలు అనుకోవచ్చు. కానీ సీఎం జగన్‌ ఎప్పుడూ పొత్తుల్లేకుండానే రాజకీయం చేస్తున్నారు.’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img