విజయవాడలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తెలంగాణలో నిజామాబాద్ నుంచి కనకదుర్గమ్మ దర్శనానికి విజయవాడ వచ్చిన పప్పుల సురేష్ కుటుంబం కన్యకా పరమేశ్వరి సత్రంలో రూమ్ అద్దెకు తీసుకున్నారు. ఈ తెల్లవారుజామున అప్పుల బాధతో చనిపోతున్నట్లు బంధువుకు మెసేజ్ పెట్టారు. తల్లీ, కొడుకు కన్యకా పరమేశ్వరి సత్రంలో విషం తాగి ఆత్మహత్య చేసుకోగా.. తండ్రీ, కొడుకు కృష్ణానదిలో దూకి గల్లంతయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.