ఓఎంసీ కేసులో ఏఐఎస్ అధికారిణి శ్రీలక్ష్మీకి హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. శ్రీలక్ష్మీకి క్లీన్ చిట్ ఇస్తూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఏఐఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ ఏడాది పాటు జైల్లో ఉన్నారు. ప్రస్తుతం ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ ఏపీలో ఉన్నారు.
2004 – 2009లో శ్రీలక్ష్మి మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సమయంలో ఈ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. మైనింగ్కు పాల్పడిన వారికి శ్రీలక్ష్మి సహకరించారనే ఆరోపణలతో పాటు ముడుపులు కూడా తీసుకున్నారంటూ సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా… ఎలాంటి సాక్ష్యాధారాలు లేనందున శ్రీలక్ష్మిపై ఉన్న అభియోగాలన్నింటినీ కొట్టివేస్తూ హైకోర్టు క్లీన్చిట్ ఇచ్చింది. కాగా…ఈ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు క్లీన్చిట్ ఇవ్వడంతో శ్రీలక్ష్మి ఏపీ చీఫ్ సెక్రటరీగా నియమితులు అయ్యేందుకు అడ్డంకులు పూర్తిగా తొలగిపోయాయని చెప్పుకోవచ్చు.