ఓటిఎస్ నచ్చితేనే ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, ఇది పూర్తిగా ప్రజల ఇష్టానికే వదిలేశామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పేదలకు సొంతింటిపై పూర్తి హక్కుల కల్పనే వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) ముఖ్య ఉద్దేశమని అన్నారు. టీడీపీ హయాంలో పేదల ఇళ్ళకు ఎందుకని రిజిస్ట్రేషన్లు చేయలేదని మంత్రి ప్రశ్నించారు. దీనిపై ప్రజలకు అవగాహన కలిగించాలని కోరితే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ పథకాన్ని పేదలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఓటిఎస్ కింద ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఈ నెల 28తో ముగియనుండగా గడువును పెంచాలని అనేకమంది కోరుతున్నారని చెప్పారు.