Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కడప జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన

ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన సీఎం జగన్‌
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కడప జిల్లా పర్యటన కొనసాగుతోంది. రెండోరోజు ఇడుపులపాయలోని ఘాట్‌లో దివంగత నేత వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు. సీఎం వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఉన్నారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి పులివెందులలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ముందు విజయ హోమ్స్‌ దగ్గర ఉన్న జంక్షన్‌ను ప్రారంభించారు.అనంతరం కదిరి రోడ్డు జంక్షన్‌, విస్తరణ రోడ్డును, నూతన కూరగాయల మార్కెట్‌ను, మైత్రి లేఅవుట్‌లో వైఎస్సార్‌ మెమోరియల్‌ పార్కును ప్రారంభిస్తారు. ఆ తర్వాత రాయలాపురం నూతన బ్రిడ్జిని ప్రారంభిస్తారు. డాక్టర్‌ వైఎస్సార్‌ బస్‌ టర్మినల్‌ను ప్రారంభించి బస్టాండు ఆవరణంలో సభలో ప్రసంగిస్తారు. అనంతరం నాడు-నేడు ద్వారా అభివృద్ధి చేసిన అహోబిలాపురం స్కూలును ప్రారంభిస్తారు.అక్కడి నుంచి వెళ్లి మురుగునీటిశుద్ధి కేంద్రాన్ని, గార్బేజీ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ను ప్రారంభిస్తారు. తిరిగి భాకరాపురం హెలీఫ్యాడ్‌కు చేరుకుని అక్కడ నుంచి ఇడుపులపాయకు బయలుదేరి వెళతారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. ఇటు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం క్రిస్మస్‌ పండుగ సందర్భంగా పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడే క్రిస్మస్‌ కేక్‌ను కట్‌ చేయనున్నారు. ఆ తర్వాత తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img