కడప జైలు ఇన్చార్జి సూపరింటెండెంట్ వరుణారెడ్డి బదిలీ అయ్యారు. వరుణారెడ్డిని ఒంగోలు జైలర్గా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కడప సెంట్రల్ జైలు సూపరెండెంట్ గా ఒంగోలు నుండి బదిలీ అయిన ప్రకాశ్ను నియమించారు. ఇటీవల కడప సెంట్రల్ జైలు ఇన్ చార్జి సూపరెండెంట్గా బాద్యతలు వరుణారెడ్డి తీసుకున్నారు. గతంలో పరిటాల రవి హత్య కేసులో నిందితుడు మొద్దుశీను హత్యకేసులో నాటి అనంతపురం జైలర్గా అనేక ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్కు వరుణారెడ్డి గురయ్యారు.