Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

కరుడుగట్టిన నేరగాళ్లు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు : బొండా ఉమ

వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యకేసులో సాక్ష్యాలతో వైసీపీ నేతల ప్రమేయం బయట పడినప్పటికీ సీఎం జగన్‌ ఇంతవరకు ఎందుకు మాట్లాడడంలేదని టీడీపీ సీనియర్‌ నేత బొండా ఉమ ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అవినాష్‌రెడ్డిని కాపాడేందుకు మూడేళ్లుగా ముఖ్యమంత్రి జగన్‌ చేయని ప్రయత్నమంటూ లేదన్నారు. వివేకా హత్య కేసు వివరాలను సీబీఐ సగం మాత్రమే వెలికితీసిందన్నారు. కరుడుగట్టిన నేరగాళ్లు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని, ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img