కరోనా కట్టడి కంటే కక్షసాధింపు చర్యలకే వైసీపీ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు.సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒమిక్రాన్ ముంచుకొస్తున్నా సీఎం జగన్ మొద్దు నిద్ర వీడట్లేదని అన్నారు. ఓ ప్రక్క ఏపీలో ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుంటే..మొక్కబడి సమీక్షలతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సరిపెడుతున్నారని ధ్వజమెత్తారు. పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ, కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారన్నారు. కరోనాకు ముందస్తు చర్యలు లేని రాష్ట్రం ఏపీనేనని అన్నారు.జగన్రెడ్డి నిర్లక్ష్యంతో కరోనా ఫస్ట్, సెకండ్వేవ్లో భారీ ప్రాణనష్టం జరిగిందన్నారు. కరోనా మరణాలపై ప్రభుత్వం కాకిలెక్కలు చెప్పిందన్నారు. రాష్ట్రంలో వైద్యశాఖ మంత్రి ఆళ్లనాని జాడ లేరని మండిపడ్డారు.ఏపీలో ఒక్కసారిగా కేసులు పెరిగితే కష్టమేనని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి.. ముందస్తు చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు.