కర్నూలు, నంద్యాల జిల్లాలో భారీ వర్షాలు కురిసాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజామున వరకు ఉమ్మడి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షాల మూలంగా వాగులు వంకలు పొంగిపొర్లాయి. పలు ప్రాజెక్టులు నిండుకున్నాయి. దీంతో చాలా చోట్ల పంటలు నీట మునిగాయి. మరోవైపు కురిసిన వర్షాల మూలంగా ఉమ్మడి జిల్లాలో పలు ప్రాజెక్టులకు వరద నీరు చేరుకుంది. దీంతో నిండుకున్న ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు.