తులసిరెడ్డి
పోలవరం ప్రాజెక్ట్కు బీజేపీ శనిగ్రహంలా టీడీపీ, వైసీపీలు రాహు, కేతువులుగా దాపురించాయని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తయ్యేదని అన్నారు. కాంగ్రెస్ పాలనలో పోలవరానికి 90 శాతం అనుమతులు తెచ్చామని గుర్తుచేశారు. రూ.5,136 కోట్ల రాష్ట్ర నిధులు ఖర్చుచేసి 32 శాతం పనులు పూర్తిచేశామని తెలిపారు.