కాకినాడ రూరల్ వలసపాకల కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం ఘాటైన వాసన రావడంతో 5, 6 తరగతి గదుల్లో ఊపిరి ఆడకపోవడంతో 50 మంది విద్యార్ధులు ఊపిరాడక తీవ్ర ఇబ్బందిపడ్డారు. తరగతి గదుల్లో ఊపిరాడకపోవడంతో పాఠశాల బయటకు తెచ్చి వారికి సపర్యలు చేశారు. అప్పటికీ కుదుటపడకపోవడంతో వెంటనే వారిని దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించగా.. డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. మిగిలిన విద్యార్ధులను స్కూల్ నుంచి తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్లిపోయారు. ఘాటైన విషవాయువు పీల్చడం వల్లే విద్యార్థులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడ్డారని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ బుద్ధ చెప్పారు. విద్యార్థులకు చికిత్స అందిస్తున్నామని, పరిస్థితి అదుపులోనే ఉందన్నారు.