కాకినాడలోని వాకలపూడి షుగర్ ఫ్యాక్టరీలో మరోసారి పేలుడు చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా.. మరి కొందరు గాయపడ్డారు. 10 రోజుల కిందట ఇదే ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగి ఇద్దరు కార్మికులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. కేవలం 10 రోజుల వ్యవధిలోనే పరిశ్రమలో మరోసారి ప్రమాదం జరగడంతో కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. బాయిలర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని కాకినాడ జీజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.మృతులను రాగం ప్రసాద్, సుబ్రమణ్యేశ్వరరావుగా గుర్తించారు. లను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మళ్లీ అక్కడ ప్రమాదం చోటు చేసుకోవడం అలజడి రేపుతోంది.