Friday, April 19, 2024
Friday, April 19, 2024

కాణిపాకం ఆలయంలో విలువైన నగ మాయం..విచారణ జరిపిస్తామని మంత్రి హామీ

వేలూరు గోల్డెన్‌ టెంపుల్‌ కి చెందిన నారాయణ శక్తి అమ్మణ్‌ వరసిద్ధి వినాయకుడికి బంగారు విభూది పట్టీని సమర్పించారు. మహాకుంభాభిషేకంలో పాల్గొని ఈ కానుక సమర్పించారు. ఈ నగ విలువ సుమారు రూ.18 లక్షలు ఉంటుందని సమాచారం. అయితే, దీనికి సంబంధించి ఆలయ అధికారులు ఎలాంటి రసీదు ఇవ్వలేదు. తర్వాత ఇస్తామని చెప్పారని దాత వివరించారు. ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా ఆగస్టు 27న నిర్వహించిన మహా కుంభాభిషేకంలో స్వామి వారికి ఈ నగను అలంకరించారు. తర్వాత బ్రహ్మోత్సవాలలోనూ ఉపయోగించారు. ఈ క్రమంలో రసీదు కోసం మరోసారి ఆలయ అధికారులను ఆశ్రయించగా.. నగ కనిపించట్లేదనే విషయం బయటపడిరదని దాత చెప్పారు. ఆలయ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే బంగారు విభూది పట్టీ మాయమైందని మంత్రులకు దాత ఫిర్యాదు చేశారు.దాంతో కాణిపాకం ఆలయంలో విలువైన నగ మాయమవడం సంచలనంగా మారింది. స్వామి వారికి భక్తితో దాత అందజేసిన విభూది పట్టీ కనిపించడంలేదని సమాచారం. దీంతో సదరు దాత ఈ విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆపై దేవాదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ దృష్టికి వెళ్లడంతో.. సమగ్ర విచారణ జరిపిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img