కేంద్రానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్న
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మంగళవారం రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వానికి ఓ ప్రశ్నను సంధించారు. దేశంలో కార్పొరేట్ సంస్థలు పన్నులు(కస్టమ్స్ డ్యూటీ) ఎగవేస్తున్న వైనాన్ని అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ను ప్రశ్నించారు.అంతేకాకుండా ఇప్పటిదాకా ఆయా కార్పొరేట్ సంస్థలు పాల్పడిన పన్ను ఎగవేతల కారణంగా దేశానికి ఎంత మేర నష్టం వాటిల్లింది?.. ఈ విషయంపై ప్రభుత్వం వద్ద ఏమైనా లెక్కలున్నాయా?.. ఆ దిశగా ఇప్పటిదాకా ఏమైనా వివరాలు సేకరించారా? అని కూడా ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు.