: ఎస్ఈసీ నీలం సాహ్ని
కుప్పంలో పోలింగ్ బూత్ వెలుపల చిన్న చిన్న ఘటనలు మినహాయిస్తే పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని రాష్ట్ర ఎన్నికల అధికారి నీలం సాహ్ని పేర్కొన్నారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణపై రాష్ట్ర ఎన్నికల అధికారి ఈ మేరకు మంగళవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. వెబ్కాస్టింగ్, వీడియో గ్రఫీ, సీసీటీవీ కెమెరాల నిఘాలో పోలింగ్ జరిగిందన్నారు. చిత్తూరు ఎస్పీ కుప్పంలో ఉండి, పరిస్థితిని శాంతిభద్రతలను స్వయంగా పర్యవేక్షించారన్నారు. ఎన్నికల పరిశీలకులు ప్రతి బూత్కు వెళ్లి పోలింగ్ తీరును స్వయంగా పరిశీలించారని తెలిపారు.