Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

కుప్పంలో వైసీపీ ఘన విజయం

రాష్ట్రంలో పలుచోట్ల ఎన్నికలు జరగ్గా అందరి చూపు.. నరాలు తెగేలా ఉత్కంఠ మాత్రం.. కుప్పం మున్సిపాలిటీపైనే. అయితే చంద్రబాబు కంచుకోట కుప్పంలో వైసీపీ ఘన విజయం సాధించింది. మున్సిపాలిటీలోని 25 వార్డుల్లో 19 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది.భారీ మెజారిటీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు. మొదటి రౌండ్‌లో 15 వార్డులకుగాను 13 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించగా.. టీడీపీ కేవలం రెండు వార్డులకే పరిమితమైంది. తర్వాత వెలువడిన ఫలితాల్లోనూ టీడీపీ అభ్యర్థులు తేరుకోలేకపోయారు. చంద్రబాబు కంచుకోటలో వైసీపీ గెలవడంతో ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నాయి. అటు కుప్పంలో.. ఇటు వైసీపీ ప్రధాన పార్టీ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img