హైదరాబాద్లోని జలసౌధలో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా గెజిట్ నోటిఫికేషన్లోని అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి ఏపీ తరుపున జలవనరుల శాఖ కార్యదర్శి, ఈఎన్సీ, ఇంజనీర్లు హాజరు కాగా, తెలంగాణ అధికారులు గైర్హాజరయ్యారు. అక్టోబర్ 14 నుంచి బోర్డులకు పూర్తి అధికారం ఇస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు నదులపై చేపట్టిన ప్రాజెక్ట్ల వివరాలపై గోదావరి, కృష్ణా బోర్డుల సంయుక్త సమన్వయ కమిటీ వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. గెజిట్ నోటిఫికేషన్లోని అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకెళాతామని ఏపీ వెల్లడిరచింది. అభ్యంతరాలు లేని ప్రాజెక్టు వివరాలైతే ఇస్తామని, వివరాల సమర్పణకు వారం గడువు కావాలని కోరింది.