Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

కృష్ణా జలాశయాల కమిటీ భేటీ… వరుసగా రెండో భేటీకి తెలంగాణ గైర్హాజరు

కృష్ణా నదిపై నిర్మించిన జలాశయాల నిర్వహణకు సంబంధించి జరిగిన కృష్ణా జలాశయాల నిర్వహణ కమిటీ ఇవాళ హైదరాబాద్‌లోని జలసౌధలో భేటీ అయ్యింది. ఈ భేటీకి ఏపీ నుంచి ఈఎన్సీ నారాయణ రెడ్డితో పాటు ఆ రాష్ట్ర ప్రతినిధి బృందం హాజరు కాగా… తెలంగాణ నుంచి ఏ ఒక్కరు కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఈ కమిటీ భేటీకి తెలంగాణ గైర్హాజరు కావడం ఇది రెండోసారి. కృష్ణా నదీ జలాల యాజమాన్య కమిటీ (కేఆర్‌ఎంబీ) సభ్యుడు రవికుమార్‌ పిళ్‌లై నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో శ్రీశైలంతో పాటు నాగార్జున సాగర్‌ జలాశయాల్లో విద్యుదుత్పత్తి, రూల్‌ కర్వ్‌పై చర్చ జరిగింది. ఈ కమిటీ తొలిసారి సమావేశానికి కూడా గైర్హాజరైన తెలంగాణ ఈఎన్సీ… రెండో సమావేశాన్ని జూన్‌ 15 తర్వాత ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. అయితే ఆయన అభ్యర్థనకు విరుద్ధంగా సోమవారం (మే 30)ననే సమావేశం ఏర్పాటు చేయడంతోనే తెలంగాణ ప్రతినిధి బృందం ఈ భేటీకి గైరాహజరు అయినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img