Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పోటా పోటీగా ధరలు పెంచుతున్నాయి

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పోటా పోటీగా ధరలు పెంచుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, గ్యాస్‌, డీజిల్‌ ధరలు అధికంగా పెంచి ప్రజలపై మోయలేని భారం వేస్తోందని అన్నారు. ప్రధాని స్థానంలో ఉండి ధరలపై మోదీ అబద్ధాలు ఆడుతున్నారన్నారు. 2014లో సెంట్రల్‌ టాక్స్‌కు ఇప్పుడు టాక్స్‌ తేడా ఎంత అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు లేని విధంగా ఆర్టీసీపై 720 కోట్ల డిజిల్‌ చెస్‌ వేశారన్నారు. కరెంట్‌ చార్జీలు పెంచి ఒక పక్క వాతలు, మరో పక్క కరెంట్‌ కట్‌ చేసి కోతలు అని అన్నారు.ధరలు, చార్జీలు, పన్నులకు నిరసనగా ఎన్ని ధర్నాలు చేసినా ప్రభుత్వానికి చలనం లేదన్నారు. రాష్ట్ర సచివాలయం దగ్గర మే 9న ధర్నా చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం ఏలుతుందని విమర్శించారు. ఎన్ని ఆటంకాలు పెట్టిన సీపీఐ పార్టీ ధర్నాలు చేపడతామని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img