కేంద్రానికి టీడీపీ నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. కాకినాడ సెజ్లో ఏర్పాటు చేసే బల్క్ డ్రగ్ పార్క్ వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని ఆయన ఫిర్యాదు చేశారు. ప్రతిపాదనను తక్షణమే విరమించుకోవాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శికి లేఖ రాశారు. లేఖ ప్రతులను జాతీయ హరిత ట్రిబ్యునల్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పంపారు. బహుళ-ఉత్పత్తి, ప్రత్యేక ఆర్థిక మండలి ప్రాజెక్ట్ అమలు ప్రయోజనం కోసం రైతుల నుంచి ప్రభుత్వం 8,500 ఎకరాల భూమిని సేకరించిందన్నారు. ఇక్కడ జరిగే పరిశ్రమల ఏర్పాటు వల్ల మత్యకారుల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తానని ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆనాడు వైఎస్సార్ హామీ ఇచ్చారన్నారు. అందుకు విరుద్ధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరబిందో రియల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేటు లిమిటెడ్కు ఫార్మా పార్క్ ఏర్పాటుకు ప్రణాళికలు వేస్తున్నారన్నారు.ఫార్మా పరిశ్రమ ప్రతికూల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని.. రైతులు, మత్స్యకారులు ప్రజలు పెద్ద సంఖ్యలో ఇప్పటికే ఆందోళనలు చేస్తున్నారని యనమల రామకృష్ణుడు ఆ లేఖలో పేర్కొన్నారు.