రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వర్చువల్గా సమావేశమై 26 జిల్లాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 26 జిల్లాల్లో 70 రెవిన్యూ డివిజన్లను ఏర్పాటుచేస్తారు. కొత్త జిల్లాలు: పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి జిల్లా, అనకాపల్లి, కోనసీమ, రాజమండ్రి, నరసాపురం, బాపట్ల, నర్సరావుపేట, తిరుపతి, అన్నమయ్య జిల్లా, నంద్యాల, సత్యసాయి, ఎన్టీఆర్ విజయవాడలను కొత్త జిల్లాలుగా ప్రకటించారు. రెవెన్యూ డివిజన్లు: కుప్పం, పలాస, బొబ్బిలి, చీపురుపల్లి, భీమిలి, కొత్తపేట, భీమవరం, ఉయ్యూరు, తిరువూరు, నందిగామలను రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేశారు. అలాగే బాపట్ల, చీరాల, సత్తెనపల్లి, ఆత్మకూరు, డోన్, గుంతకల్, ధర్మవరం, పుట్టపర్తి, రాయచోటి, పలమనేరు, నగరి, శ్రీకాళహస్తిలను రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.