రాజ్యసభలో విజయసాయిరెడ్డి డిమాండ్
కొత్త జిల్లాలకు కేంద్రీయ విద్యాలయాలను కేటాయించాలని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.బుధవారం నాటి పార్లమెంటు సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావించిన విజయసాయిరెడ్డి.. ఏపీలో కొత్తగా ఏర్పాటైన కొత్త జిల్లాలకు కేంద్రీయ విద్యాలయాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందని కూడా విజయసాయిరెడ్డి తెలిపారు.