గణాంకాలు, అంకెలతో సంబంధం లేకుండా మనం కొవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సగటున 1300 కేసులకు పడిపోయినప్పటికీ మనం జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. కొవిడ్ మార్గదర్శకాలను పాటించాలి. పాటించకపోతే కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని తన నివాసంలో కొవిడ్`19పై అధికారులతో బుధవారం సీఎం జగన్ స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, కరోనా వైరస్పై అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. ‘థర్డ్ వేవ్ వస్తుందో, లేదో తెలియదు గానీ మనం మాత్రం సన్నద్ధంగా ఉండాలి. కార్యాచరణ ప్రకారం ముందుకు సాగాలి. ఆస్పత్రులను, సిబ్బందిని సన్నద్ధంగా ఉంచుకోవాలి. నర్సులకు శిక్షణ కూడా ఇవ్వాలి. బెడ్లను అందుబాటులో ఉంచుకోవాలి.’ అని సూచించారు. 85 శాతం ప్రజలకు డబుల్డోస్ ఇచ్చేంతవరకూ కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రస్తుతం 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉన్నవారికి వ్యాక్సిన్లపై దృష్టి పెట్టాలన్నారు. సచివాలయాన్ని యూనిట్గా పెట్టుకుని ప్రతి ఇంటిలో ఉన్నవారికీ వ్యాక్సిన్లు పూర్తిచేసేలా ముందడుగు వేయండని చెప్పారు.