వచ్చే 12 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం విడుదల చేసిన వెదర్ బులెటిన్లో తెలిపింది. ఈ ప్రభావం వల్ల కోస్తా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో నవంబరు 9 నుంచి 11వతేదీల మధ్య భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. భారీవర్షాల తర్వాత మరో రోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవవచ్చని ఐఎండీ పేర్కొంది. అల్పపీడనం కారణంగా బంగాళాఖాతంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొంటాయని నవంబర్ 11వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ తీరంలోని సముద్రంలో చేపలవేటకు మత్స్యకారులు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.