Friday, April 19, 2024
Friday, April 19, 2024

క్షమాపణలు తెలిపిన సోము వీర్రాజు

ప్రభుత్వ తీరును విమర్శించే క్రమంలో వాడిన పదాలు రాయలసీమ ప్రజల మనసులను గాయపరిచాయని.. అందుకే వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ఆ వ్యాఖ్యలపై రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు. రాయలసీమ రతనాల సీమ’అనే పదం తన హృదయంలో పదిలమన్న సోము.. రాయలసీమ అభివృద్ధి కోసం అనేక వేదికలపై ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. ఈ విషయం ఆ ప్రాంత వాసులకు తెలుసు, రాయలసీమకు నికర జలాలు, పెండిరగ్‌ ప్రాజెక్టుల విషయాలను అనేక సందర్భాల్లో ప్రస్తావించానని గుర్తు చేశారు. రాయలసీమ అభివృద్ధి ఇంకా వేగవంతం కావాలని భారతీయ జనతా పార్టీ ఆలోచన అని సోము వీర్రాజు పేర్కొన్నారు. కాగా, రాయలసీమలో ఎయిర్‌పోర్ట్‌.. కడపలో ఎయిర్‌పోర్ట్‌.. ప్రాణాలు తీసేసే వాళ్ల జిల్లాలో కూడా ఎయిర్‌పోర్ట్‌.. వాళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చు’అని సోము వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img