: చంద్రబాబు
వైఎస్సార్ వర్థంతికి వర్తించని కొవిడ్ నిబంధనలు గణేష్ ఉత్సవాలకు ఏ విధంగా వర్తిస్తాయని టీడీపీ అధినేత చంద్రబాబు నిలదీశారు. పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గణేష్ ఉత్సవాలకు తెలంగాణలో అనుమతించినప్పుడు..ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అనుమతించరని ప్రశ్నించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే 175 నియోజకవర్గాల్లో ఈనెల 10న చవితి పూజా కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానం తీశారు. జగన్రెడ్డి రైతు వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నామని, మద్యనిషేధంపై మహిళలతో కలిసి ఉద్యమించాలని తీర్మానించామని ప్రకటించారు.