ఓవైపు ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ చర్చలు కొనసాగుతుండగా మరోవైపు ప్రభుత్వం తాజాగా మైనింగ్ శాఖలో ఎస్మా ప్రయోగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మైనింగ్ శాఖలో సమ్మె, ఇతర ఆందోళనలపై నిషేధం విధించింది. సమ్మెకి దిగితే ఎస్మా ప్రయోగిస్తామని మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.మైనింగ్శాఖలో ఎస్మా ఉత్తర్వులపై ఉద్యోగులు నివ్వెరపోతున్నారు. చర్చల సమయంలో ఎస్మా ఉత్తర్వులు సరికాదని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు.